News January 18, 2025
పిట్లం: మేనత్త హత్య.. నిందితుడి అరెస్టు

మహిళను హత్య చేసిన నిందితుడిని శుక్రవారం రిమాండ్ చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపారు. గురువారం చిన్న కొడప్గల్కు చెందిన గొరిగే సత్యవ్వ(55) వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా శుక్రవారం పిట్లంలో గొరిగే రవిని అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాగుడుకు బానిసై మేనత్తను హత్య చేసి, ఆభరణాలను అపహరించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News September 14, 2025
వికసిత్ భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యం: జేపీ నడ్డా

వికసిత భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం విశాఖ రైల్వే గ్రౌండ్స్లో సారద్యమ్ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మగ్గిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 15 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు. మోదీ, చంద్రబాబు అంకితభావం వల్లే ఈ మార్పు సాధ్యమైందన్నారు.
News September 14, 2025
HYD భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు

నాగోల్లో భార్య మహాలక్ష్మి గొంతును భర్త వేణుగోపాల్ కత్తితో కోశాడు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అతడు మారకపోగా.. ఈరోజు ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా, వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2025
MBNR:GOOD NEWS.. ITIలలో నేరుగా ప్రవేశాలు

MBNRలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మిగిలి ఉన్న సీట్లకు వాక్ ఇన్ అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ బి.శాంతయ్య Way2Newsతో తెలిపారు. ప్రభుత్వ ITI/ATC, ప్రైవేట్ కాలేజీలలో ఈ నెల 30 వరకు 4వ విడత స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని, 1,2,3 విడుదలలో అప్లై చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, అర్హత గల ఉమ్మడి జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.