News March 17, 2024
కేసీఆర్కు ఝలకిచ్చే ప్లాన్!
కాంగ్రెస్లో BRSLP విలీనం దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. చట్టపరంగా 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే BRS పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో 25 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా బీఆర్ఎస్ను చావుదెబ్బ కొట్టడమే కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది.
Similar News
News September 30, 2024
సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఐర్లాండ్
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. టీ20 WC-2024 రన్నరప్ సౌతాఫ్రికాను ఐర్లాండ్ ఓడించింది. టీ20 చరిత్రలో SAపై ఆ జట్టుకు ఇదే తొలి విజయం. అబుదాబి వేదికగా జరిగిన రెండో టీ20లో తొలుత ఐర్లాండ్ 195/6 స్కోర్ చేయగా, SA 185/9కి పరిమితమైంది. IRE జట్టులో రాస్ అడైర్ సెంచరీతో చెలరేగాడు. దీంతో రెండు మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది.
News September 30, 2024
రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ OCT 1, 2 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు వెళ్లి, అలిపిరి మెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు. రాత్రి 9 గం.కు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉ.10 గం.కు శ్రీవారిని దర్శించుకుని, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులతో మాట్లాడుతారు. గురువారం సాయంత్రం తిరుపతికి వస్తారు.
News September 30, 2024
పదో తరగతి మార్కులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: GPAతో జారీ చేసిన పదో తరగతి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2012-2019 మధ్య GPA సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులు అడిగితే మార్కులు, శాతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు ఇందుకోసం SSC బోర్డు <