News January 18, 2025

నితీశ్‌కు నిరాశ

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన తెలుగు తేజం నితీశ్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. పేస్ ఆల్‌రౌండర్లలో పాండ్య వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. దీంతో తెలుగు క్రికెట్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. మరోవైపు పేసర్ సిరాజ్‌, బ్యాటర్ తిలక్ వర్మను కూడా జట్టులోకి తీసుకోలేదు. దీంతో తెలుగు స్టేట్స్ నుంచి CTలో ప్రాతినిధ్యం లేకుండాపోయింది.

Similar News

News April 17, 2026

ధురంధర్-2లో దావూద్ ఇబ్రహీం పాత్ర కరెక్ట్ కాదు: RGV

image

ధురంధర్-2లో దావూద్ ఇబ్రహీం పాత్రను తప్పుగా చూపించారని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. ‘దావూద్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాడని, ఏ పనీ చేయట్లేదని కొన్నేళ్లుగా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. అతడు క్రిమినల్ యాక్టివిటీస్ నుంచి 20 ఏళ్ల క్రితమే రిటైర్ అయినట్లు నమ్ముతున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా భారత్‌లో అలజడి సృష్టించేందుకు దావూద్ అక్కడి ISIతో కలిసి కుట్రలు పన్నినట్లు ఈ మూవీలో చూపించారు.

News April 17, 2026

అపార్టుమెంట్లలో EV ఛార్జింగ్ పాయింట్లు

image

TG: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా GOVT, PVT భాగస్వామ్యంలో మరిన్ని EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని CS రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. EVల సంఖ్య పెరుగుతున్నందున గ్రామీణ, పట్టణ ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటి మ్యాపింగ్‌కు డ్యాష్ బోర్డును అభివృద్ధి చేయాలన్నారు. నగరాల్లోని అపార్టుమెంట్లలో ఈ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరి చేయనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.

News April 17, 2026

కాసేపట్లో ఓటింగ్.. బలాబలాలు ఇవే

image

మహిళా రిజర్వేషన్లు(రాజ్యాంగ సవరణ), డీలిమిటేషన్ బిల్లులపై కాసేపట్లో లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ అవసరం. ప్రస్తుతం LSలో 540 మంది సభ్యులు ఉన్నారు. అంటే 360 మంది MPల మద్దతు కావాలి. NDAకి 293 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లులు పాస్ కావాలంటే మరో 67 మంది MPల సపోర్ట్ అవసరం. అటు విపక్షాల బలం 233. ఎక్కువ మంది విపక్ష పార్టీల సభ్యులు గైర్హాజరైతే బిల్లులు పాసయ్యే ఛాన్స్ ఉంది.