News January 18, 2025

KMR: ఈ నెల 21 నుంచి ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు

image

కామారెడ్డి జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించుటకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నట్లు KMR జిల్లా వెల్ఫేర్ అధికారి ప్రమీల శనివారం తెలిపారు. ఈ నెల 21న కామారెడ్డి, 22న ఎల్లారెడ్డి, 23న జుక్కల్, 24న బాన్సువాడ నియోజకవర్గాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ క్యాంప్‌కు హాజరయ్యే వారు సంబంధిత పత్రాలతో ఉదయం 9:30 గం.లకు హాజరు కావాలని సూచించారు.

Similar News

News March 1, 2026

హీరో విజయ్‌కు మరో షాక్..

image

తమిళ స్టార్ హీరో విజయ్‌కు వ్యక్తిగత జీవితంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. తన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన వేళ కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఓ నటితో విజయ్‌కు అఫైర్ ఉందని తన తల్లి చేసిన ఆరోపణల్లో వాస్తవాలున్నాయని, అందుకే అన్‌ఫాలో చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా భార్య చేసిన ఆరోపణలపై విజయ్ ఇప్పటివరకూ స్పందించలేదు.

News March 1, 2026

రేపు వికారాబాద్‌కు రాహుల్ గాంధీ రాక

image

అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల డీసీసీల శిక్షణా తరగతులు రేపటితో ముగుస్తాయి. ఈ తరగతులకు ఈ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ రానున్నారు. జిల్లా అధ్యక్షులు తీసుకోవాల్సిన నిర్ణయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ చీఫ్ మహేశ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారని సమాచరం. దీనికోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 1, 2026

ఇవాళ్టి నుంచి దివ్యాంగులకు బస్సుల్లో ఫ్రీ జర్నీ

image

దివ్యాంగుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ‘ఇంద్రధనస్సు’ పథకం కింద ఇవాళ్టి నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది. మహిళలకు అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ తరహాలోనే 40%, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. సదరం సర్టిఫికెట్ లేదా స్మార్ట్ కార్డ్ చూపించి జీరో టికెట్ పొందొచ్చు. ఇతర బస్సుల్లో పాత పద్ధతిలోనే 50% రాయితీ ఉంటుంది.