News March 17, 2024

రేపటి నుంచి ఎగ్జామ్స్.. LIFT అడిగితే సాయం చేయండి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించరు. కాబట్టి వాహనదారులను ఎవరైనా విద్యార్థులు లిఫ్ట్ అడిగితే దయచేసి వారికి లిఫ్ట్ ఇచ్చి సమయానికి పరీక్షా కేంద్రానికి చేరేందుకు సహకరించండి. >>>SHARE IT

Similar News

News September 5, 2025

ఖమ్మం: సదరం సర్టిఫికేట్లకు రూ.50 వేలు డిమాండ్..!

image

ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో సదరం క్యాంపుల్లో అవినీతి జరుగుతోందని బాధితుడు ఫిర్యాదు చేశారు. సదరం విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది బయటి వ్యక్తులతో కలిసి దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. శాశ్వత ధ్రువీకరణ పత్రానికి రూ.50 వేలు, ఐదేళ్ల సర్టిఫికేట్‌కు రూ.30 వేలు డిమాండ్ చేస్తున్నారని బాధితుడు శ్రీను గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్‌కు ఫిర్యాదు చేశారు.

News September 5, 2025

ఖమ్మం జిల్లాలో 6న వైన్స్ బంద్: సీపీ

image

గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనాన్ని పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలపై సీపీ సునీల్ దత్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్లు మూసివేయాలని ఆదేశించారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 5, 2025

KMM: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

image

భర్త బాబాయ్ వేధింపులు భరించలేక ఓ వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన ఖమ్మంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన మోషిత (24) నవీన్‌ను 2018లో ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆమె భర్తకు దూరంగా ఉంటుండగా భర్త బాబాయ్ అయిన రామకృష్ణ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.