News March 17, 2024
‘పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710685394753-normal-WIFI.webp)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలు రాయడానికి హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా రాయాలన్నారు.
Similar News
News July 8, 2024
ఖమ్మం జిల్లాకు మూడు కార్పొరేషన్ పదవులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720420884263-normal-WIFI.webp)
తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబుతో పాటు తదితర నేతలకు పదవులు దక్కాయి.
News July 8, 2024
గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720416024568-normal-WIFI.webp)
భద్రాచలంలో గల్లంతైన హైదరాబాద్కు చెందిన హరీష్ (28) మృతదేహం లభ్యమైంది. ఆదివారం రాత్రి వరకు వెతికిన ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
News July 8, 2024
ఆదాయం దండిగా వస్తున్నా.. ఇంకా అద్దె భవనాల్లోనే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720420166154-normal-WIFI.webp)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి ప్రతినెల పెద్ద మొత్తంలో ఆదాయం అందించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు సొంత స్థలాలు ఉన్నా ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సొంత భవనాలు సమకూరుతాయని, ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.