News January 19, 2025
CMRFతో నిరుపేదలకు ఊరట: షబ్బీర్ అలీ

CM రిలీఫ్ ఫండ్తో నిరుపేదలకు ఎంతో ఊరట కలుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని 26 మంది లబ్ధి దారులకు CMRF నుంచి రూ.1.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. CM సహాయ నిధి నుంచి మంజూరయ్యే ఆర్థిక సాయం పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతోందన్నారు.
Similar News
News January 21, 2026
పల్నాడు: ‘రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలి’

పల్నాడు జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూపరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్, భూ సర్వేలు, ప్రభుత్వ ప్రాధాన్యత పనులు సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సేవలు సమర్థంగా అందించాలని పేర్కొన్నారు.
News January 21, 2026
జనవరి 21: చరిత్రలో ఈరోజు

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం
News January 21, 2026
అర్హుల నుంచి టెండర్లకు ఆహ్వానం

హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవసరమైన ప్రయోగశాల సామాగ్రి సరఫరా చేయుటకు దరఖాస్తుదారుల నుంచి టెండర్లను స్వీకరించనునట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రంలోగా అర్హులైన దరఖాస్తుదారులు హనుమకొండ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ సూచించారు.


