News March 17, 2024
ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడుజీవితం’ ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ మూవీలో తాను నజీబ్ అనే బానిస పాత్ర పోషించానని, ఇందు కోసం 31 KGల బరువు తగ్గానని పృథ్వీ వెల్లడించారు. జిమ్ ట్రైనర్, డాక్టర్ల పర్యవేక్షణతో ఇది సాధ్యమైందన్నారు. జోర్డాన్లో షూటింగ్ చేస్తున్నప్పుడు కరోనా లాక్డౌన్ విధించడంతో చాలా కష్టపడ్డామని తెలిపారు. కాగా ఈ చిత్రం ‘ది గోట్ లైఫ్’ పేరుతో ఇంగ్లిష్లోనూ రిలీజ్ కానుంది.
Similar News
News September 30, 2024
రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ OCT 1, 2 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు వెళ్లి, అలిపిరి మెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు. రాత్రి 9 గం.కు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉ.10 గం.కు శ్రీవారిని దర్శించుకుని, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులతో మాట్లాడుతారు. గురువారం సాయంత్రం తిరుపతికి వస్తారు.
News September 30, 2024
పదో తరగతి మార్కులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: GPAతో జారీ చేసిన పదో తరగతి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2012-2019 మధ్య GPA సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులు అడిగితే మార్కులు, శాతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు ఇందుకోసం SSC బోర్డు <
News September 30, 2024
ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
APలో పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 2023 జులై నుంచి 2024 జూన్ వరకు కేంద్రం సర్వే నిర్వహించి ఈ గణాంకాలను ప్రకటించింది. దేశంలో 11రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ లిస్టులో కేరళ టాప్లో ఉండగా, AP ఐదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,032 మంది అమ్మాయిలున్నారు.