News January 19, 2025

పద్యాలతో జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన: JNTU ఇన్‌ఛార్జ్ వీసీ

image

అనంతపురం JNTUలోని పరిపాలన భవనంలో ఆదివారం యోగి వేమన జయంతిని పురస్కరించుకొని JNTU ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇన్‌ఛార్జ్ వీసీ మాట్లాడుతూ.. ఎంతో అద్భుతమైన పద్యాలతో ప్రపంచానికి జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన అని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 27, 2025

అనంతపురంలో దారుణం.. బాలుడిని చంపిన వ్యక్తి

image

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అరుణోదయ కాలనీలో సుశాంత్(5) అనే బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చినట్లు సమాచారం. అయితే ఆదివారం తమ బాలుడు కనిపించడం లేదని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 27, 2025

రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్‌లో సత్తాచాటిన క్రీడాకారులు

image

కర్నూలులో ఏపీ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారులు రాణించారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ.. సంతోష్‌కు అండర్-6లో 4వ స్థానం, వెనీషా‌కు బాలికల -12లో 4వ స్థానం, నితీష్‌కు -14లో 5వ స్థానం, జనని ఎఫ్-10లో 8వ స్థానం సాధించారన్నారు. విజేతలకు టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కామిశెట్టి బహుమతులు అందించారు.

News October 26, 2025

యాడికి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

image

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్‌మెన్‌గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్‌పై మోడల్ స్కూల్‌కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.