News March 17, 2024
KNL: ఇకపై ఊపందుకోనున్న అభ్యర్థుల ప్రచార పర్వం
మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ శనివారం సాయంత్రంతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో YCP, TDP-JSP-BJP, కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరగనున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఈసారి ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు హామీలు ఇవ్వనున్నారు.
Similar News
News February 3, 2025
రాయలసీమకు రూ.1.52లక్షల కోట్ల పెట్టుబడులు
రాయలసీమకు రూ.1.52లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. వేల మందికి ఉద్యోగాలు లభిస్తామని తెలిపారు. కర్నూలులో ఏజీ జెన్కో, ఎన్హెచ్టీసీ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయని వివరించారు. కడప, నంద్యాల జిల్లాల్లో SAEL సోలాల్ ఎంహెచ్పీ-2 రూ.1,728 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ఇక ఓర్వకల్లుకు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
News February 3, 2025
కర్నూలుకు జడ్జిల బృందం
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ స్పీడందుకుంది. బెంచ్కు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జిల బృందం కర్నూలుకు వస్తున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. దిన్నెదేవరపాడు వద్ద APERCకి చెందిన భవనాన్ని జడ్జిల బృందం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. కాగా గతేడాది రూ.25కోట్ల నిధులతో అత్యాధునిక హంగులతో ఆ భవనాన్ని నిర్మించారు.
News February 3, 2025
బస్ డ్రైవర్కు గుండెపోటుకు.. ప్రయాణికులు క్షేమం
ఆలూరులో నిన్న ఓ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. డ్రైవర్కు గుండెపోటుకు గురికావడమే ఈ ఘటనకు కారణంగా తెలిసింది. ట్రావెల్స్ బస్సు ఆదోని నుంచి బళ్లారికి వెళ్తోంది. పట్టణంలోని సాయిబాబా ఆలయం సమీపంలోకి రాగానే డ్రైవర్ ఉసేన్ (64)కు గుండెపోటు వచ్చింది. బస్సు స్టీరింగ్ అదుపు తప్పడం ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న డివైడర్ను ఢీకొంది. అందులోని భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ మృతి చెందారు.