News January 19, 2025
సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తా: టీజీ వెంకటేశ్

నాయి బ్రాహ్మణ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం కర్నూలులో జరిగిన శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాలను కేఎంసీ కమిషనర్ రవీంద్రబాబు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సదాశివతో కలిసి టీజీ వెంకటేశ్ ప్రారంభించారు. నాయి బ్రాహ్మణ కులవృత్తి మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతుందని అన్నారు.
Similar News
News January 17, 2026
కర్నూలు: సంక్రాంతి నాడు విషాదాంతాలు

సంక్రాంతి పండుగ నాడు పలు కుటుంబాల్లో విషాదం మిగిలింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బైక్ ఢీకొని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. పాణ్యం(M) తమ్మరాజుపల్లెలో వాహనం ఢీకొని రత్నమ్మ(50) మరణించింది. బేతంచెర్ల(M) శంకలాపురం గ్రామానికి చెందిన దస్తగిరి(33) బొలెరో ఢీకొని చనిపోయాడు. అప్పుల బాధతో గోనెగండ్లలో కౌలు రైతు జైనుద్దీన్, ఆదోనికి చెందిన వెంకటేశ్(42), కర్నూలుకు చెందిన శివకుమార్(33) ఉరేసుకున్నారు.
News January 17, 2026
కర్నూలు: భార్యను వదిలేసిన టీచర్కు రిమాండ్!

DSC కోచింగ్లో పరిచయమైన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకొని వదిలేసిన సంజామల(M) ఆకుమల్లకు చెందిన టీచర్ కలింగిరి మహేశ్ను కోవెలకుంట్ల కోర్టు 14రోజుల రిమాండ్కు పంపింది. కర్నూలు(D) సి.బెళగల్(M) కంబదహాల్కు చెందిన సారమ్మతో రెండేళ్లు సహజీవనం చేసి ఉద్యోగం రాగానే దూరం పెట్టాడు. యువతి ఒత్తిడితో ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆమెను వదిలేశాడు. దీంతో యువతి సంజామల పోలీసులను ఆశ్రయించింది.
News January 17, 2026
జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు కర్నూలు యువతి

జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు కర్నూలు బి.క్యాంప్కు చెందిన శ్రీహిత ఎంపికైనట్టు శిక్షకులు పాలు విజయకుమార్, బ్రహ్మ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 21న నుంచి 28వ తేదీ వరకు మణిపూర్లో జరిగే అండర్-19 ఎస్జీఎఫ్ఐ ఫుట్బాల్ పోటీలలో శ్రీహిత పాల్గొంటుందని పేర్కొన్నారు. గత అక్టోబర్లో ఎమ్మిగనూరులో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు.


