News March 17, 2024

ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: జగదీశ్‌రెడ్డి

image

TG: రాష్ట్రంలో పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.50వేలు, మిరప తోటలకు ఎకరాకు రూ.80వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఇదే సమయానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు జలకళతో కళకళలాడాయని, ఇప్పుడు వెలవెలబోతున్నాయని చెప్పారు.

Similar News

News September 30, 2024

రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ OCT 1, 2 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు వెళ్లి, అలిపిరి మెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు. రాత్రి 9 గం.కు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉ.10 గం.కు శ్రీవారిని దర్శించుకుని, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులతో మాట్లాడుతారు. గురువారం సాయంత్రం తిరుపతికి వస్తారు.

News September 30, 2024

పదో తరగతి మార్కులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: GPAతో జారీ చేసిన పదో తరగతి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2012-2019 మధ్య GPA సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులు అడిగితే మార్కులు, శాతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు ఇందుకోసం SSC బోర్డు <>వెబ్‌సైట్<<>> ద్వారా అప్లై చేయాలి. సర్టిఫికెట్‌లో ఎలాంటి మార్పులు లేకుండా మార్కులను అదనపు లెటర్ రూపంలో ఇస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఇవి సాయపడతాయి.

News September 30, 2024

ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య

image

APలో పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 2023 జులై నుంచి 2024 జూన్ వరకు కేంద్రం సర్వే నిర్వహించి ఈ గణాంకాలను ప్రకటించింది. దేశంలో 11రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ లిస్టులో కేరళ టాప్‌లో ఉండగా, AP ఐదో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1,032 మంది అమ్మాయిలున్నారు.