News March 17, 2024

ఇక పురుషుల వంతు..

image

ఆర్సీబీ మహిళల జట్టు WPL సీజన్-2లో టైటిల్ గెలవడంతో పురుషుల జట్టుపై ఫ్యాన్స్‌కు ఆశలు పెరిగాయి. కొన్నేళ్లుగా ఐపీఎల్ ఆరంభం నుంచి వినిపించే ‘ఈ సాలా కప్ నమ్దే’ ఈసారి నిజమవుతుందటూ ఆర్సీబీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 2008 నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ట్రోఫీని ముద్దాడుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 22న జరిగే ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభ పోరులో CSKతో ఆర్సీబీ తలపడనుంది.

Similar News

News September 30, 2024

సౌతాఫ్రికాకు షాకిచ్చిన ఐర్లాండ్

image

అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. టీ20 WC-2024 రన్నరప్ సౌతాఫ్రికాను ఐర్లాండ్ ఓడించింది. టీ20 చరిత్రలో SAపై ఆ జట్టుకు ఇదే తొలి విజయం. అబుదాబి వేదికగా జరిగిన రెండో టీ20లో తొలుత ఐర్లాండ్ 195/6 స్కోర్ చేయగా, SA 185/9కి పరిమితమైంది. IRE జట్టులో రాస్ అడైర్ సెంచరీతో చెలరేగాడు. దీంతో రెండు మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది.

News September 30, 2024

రేపు తిరుమలకు పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ OCT 1, 2 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు వెళ్లి, అలిపిరి మెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు. రాత్రి 9 గం.కు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉ.10 గం.కు శ్రీవారిని దర్శించుకుని, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులతో మాట్లాడుతారు. గురువారం సాయంత్రం తిరుపతికి వస్తారు.

News September 30, 2024

పదో తరగతి మార్కులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: GPAతో జారీ చేసిన పదో తరగతి సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2012-2019 మధ్య GPA సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులు అడిగితే మార్కులు, శాతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులు ఇందుకోసం SSC బోర్డు <>వెబ్‌సైట్<<>> ద్వారా అప్లై చేయాలి. సర్టిఫికెట్‌లో ఎలాంటి మార్పులు లేకుండా మార్కులను అదనపు లెటర్ రూపంలో ఇస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఇవి సాయపడతాయి.