News January 20, 2025
KMR: గ్రామ సభల్లో వైద్య సిబ్బంది పాల్గొనాలి: జిల్లా వైద్యాధికారి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామసభల కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో సంబంధిత గ్రామ, మండల ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొనాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.చంద్రశేఖర్ ఆదేశించారు. ఆశా, ANM, సూపర్వైజరీ, MLHP ప్రతి గ్రామ సభల్లో తప్పకుండా ఉండాలన్నారు. గ్రామ సభల్లో సంబంధిత రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News January 2, 2026
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సూర్యాపేట ఎస్పీ

సైబర్ మోసాల నియంత్రణకు తెలంగాణ పోలీస్ చేపట్టిన ‘ఫ్రాడ్ కాల్ పుల్ స్టాప్’ పోస్టర్ను జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లోన్లు, బహుమతుల కాల్స్ను నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఎవరికీ తెలపవద్దన్నారు. బాధితులు తక్షణమే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని, ప్రజల సహకారంతోనే సైబర్ నేరాలను అరికట్టగలమని ఎస్పీ స్పష్టం చేశారు.
News January 2, 2026
సంక్రాంతికి రైతు భరోసా!

TG: సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతుభరోసా డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’తెలిపింది. SMలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని పేర్కొంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను ఏరివేసే పనిలో సర్కార్ ఉందని, అర్హులైన రైతులకు ఎకరానికి రూ.6000 చొప్పున పండగ నాటికి జమ చేయనుందని చెప్పింది. 4లక్షల ఎకరాలు కమర్షియల్ ల్యాండ్గా గుర్తించినట్లు వెల్లడించింది.
News January 2, 2026
ఈ ఏడాదిలోగా సర్వే పూర్తి: బాపట్ల JC

రీసర్వే పూర్తైన భూములకు జనవరి 9 వరకు 11 మండలాల్లోని 29 గ్రామాల్లో పాసు పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు శుక్రవారం బాపట్ల JC భావన విశిష్ట తెలిపారు. జిల్లాలో 31,760 పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా, తొలిరోజు 3 రెవెన్యూ డివిజన్లలో 4,075 పట్టాలు అందజేశామన్నారు. తొలి 2 విడతల్లో 89 గ్రామాలలో సర్వే జరుగుతుందన్నారు. మే నెలలో ప్రారంభమయ్యే 5 విడతతో సహా, 6 విడతల్లో ప్రణాళికాబద్ధంగా రీసర్వే పూర్తి చేస్తామన్నారు.


