News January 20, 2025

HYD: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ

image

రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ వేసింది. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్ నేతలతో కమిటీ వేశారు. 2 వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీ పర్యటించనుంది. పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, దుర్భర వ్యవసాయరంగ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 2 వారాల అధ్యయనం తర్వాత నివేదిక రూపకల్పన చేయనున్నట్లు సమాచారం. 

Similar News

News September 16, 2025

HYD: నాన్న.. నీవెక్కడ?

image

నాన్న రాక కోసం ఆ బాలుడు ఎదురుచూపులు ఆపడం లేదు. గుండెకు హత్తుకొని లాలించే తండ్రి కనిపించక చిన్నోడు వెక్కివెక్కి ఏడుస్తోండు. వరదలో గల్లంతైన కొడుకు కోసం తల్లి, భర్త జాడెక్కడా? అని భార్య కన్నీరుపెట్టుకుంటోంది. వినోభానగర్‌లో వరదల్లో కొట్టుకుపోయిన సన్నీ ఫ్యామిలీ విషాద గాథ ఇది. వరదల్లో కొట్టుకుపోయిన అతడి ఆనవాళ్లు 40 గంటలైనా తెలియలేదు. ఆకలి, దూప వదిలి కుటుంబీకులు నాలాల వద్ద పడిగాపులు కాయడం బాధాకరం.

News September 16, 2025

జూబ్లీహిల్స్‌లో ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ ఫ్లెక్సీలు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి రోజు రోజుకూ రాజుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎవరికివారు టికెట్ తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా రావాలి అంజన్న.. కావాలి అంజన్న అంటూ అంజన్ కుమార్ యాదవ్‌కు అనుకూలంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఉప ఎన్నికల్లో ఆయనా టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసింది. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి.

News September 16, 2025

డ్రగ్స్ తయారీలో పట్టువదలని విక్రమార్కుడు జయప్రకాశ్

image

ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్ నిర్వాహకుడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని డ్రగ్స్ తయారీకి తెరలేపాడు. ఆల్ర్ఫాజోలం ఎలాగైనా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 1, 2 సార్లు విఫలమైతే కొందరు దానిని ఆపేస్తారు. ఎలాగైనా తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 6 సార్లు ఫెయిలయ్యాడు. చివరికి ఏడోసారి సక్సస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి దందా నిరాటంకంగా కొనసాగించాడని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.