News January 20, 2025
జియో కస్టమర్లకు షాక్.. ఏకంగా రూ.100 పెంపు

రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. రూ.199 ప్లాన్ను ఒక్కసారిగా రూ.100 పెంచి, ఇకపై రూ.299 అని జియో పేర్కొంది. పెంచిన ధరలు JAN 23 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.199 ప్లాన్ కస్టమర్లు ఆటోమెటిక్గా రూ.299 ప్లాన్కు బదిలీ అవుతారు. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్, నెలకు 25GB డేటా వస్తాయి. ఇక కొత్తగా చేరే కస్టమర్లు రూ.299కి బదులు రూ.349తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
Similar News
News October 31, 2025
సర్దార్ పటేల్ ఫ్యామిలీతో మోదీ భేటీ

భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వారితో సంభాషణ, దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం గొప్పగా ఉందని Xలో పేర్కొన్నారు. గుజరాత్లోని కేవడియాలో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఆయనకు నివాళిగా స్పెషల్ కాయిన్, స్టాంప్ను మోదీ రిలీజ్ చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం(182 మీటర్లు) ఉంది.
News October 31, 2025
వర్డ్ ఆఫ్ ది ఇయర్ తెలుసా?

ఈ ఏడాదికి ‘67’ను వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ప్రముఖ ఆన్లైన్ డిక్షనరీ వెబ్సైట్ డిక్షనరీ.కామ్ ప్రకటించింది. నంబర్ను పదంగా పేర్కొనడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి అర్థం లేదని, నిర్వచించలేమని వెబ్సైట్ స్పష్టం చేసింది. అమెరికన్ ర్యాపర్ స్క్రిల్లా డ్రిల్ <
News October 30, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటలలోపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


