News March 18, 2024
ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు: నెల్లూరు జేసీ

జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ఆదివారం ఉదయం గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు ఆరోగ్య రాణి, సునీతతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
Similar News
News April 20, 2025
మనుబోలు: పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

మనుబోలు మండలంలోని వడ్లపూడి వద్ద ఆదివారం కారు బోల్తా పడి అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఐదుమంది ఉన్నారు. వీళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు. పొదలకూరు మండలం బిరదవోలు రాజుపాలెంకు చెందిన వారు కొత్త కారును కొనుగోలు చేసి గొలగమూడిలో పూజలు చేయించుకొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
News April 20, 2025
NLR: చెట్టును ఢీకొట్టిన బైక్.. యువతి మృతి

నెల్లూరు జిల్లాలో ఉదయాన్నే జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మర్రిపాడు మండలం కదిరినాయుడు పల్లి సమీపంలో నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న యువతి అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్: మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ను అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలో 48వ డివిజన్లో సురక్షిత తాగునీటి పథకంలో భాగంగా డిస్పెన్సింగ్ యూనిట్ను ప్రారంభించారు. పేద ప్రజల కోసం 2018లోని ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామన్నారు.