News January 21, 2025
రంజీ క్రికెట్ ఆడనున్న విరాట్ కోహ్లీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30న రైల్వేస్తో జరిగే మ్యాచ్కు తాను అందుబాటులో ఉంటానని ఢిల్లీ&డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(DDCA) ప్రెసిడెంట్ రోహన్ జైట్లీకి విరాట్ సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. 2012లో కోహ్లీ చివరిసారి రంజీ మ్యాచ్ ఆడారు. అటు CT-2025 ముందు రోహిత్, రాహుల్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
Similar News
News November 10, 2025
ఏం జరిగినా పవన్ నోరు మెదపరు ఎందుకు: శ్యామల

AP: జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా CM రాజీనామా చేయాలన్న పవన్ ఇప్పుడు నోరు మెదపట్లేదని YCP నేత శ్యామల విమర్శించారు. ‘మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు, నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తొక్కిసలాటల్లో భక్తులు మరణిస్తే కిక్కురు మనకూడదు. విశాఖలో 2లక్షల KGల గో మాంసం దొరికినా నోరు మూసుకొని ఉండాలి. దీనిపై పవన్గారి స్పందన ఏంటో మరి’ అని ప్రశ్నించారు.
News November 10, 2025
ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <
News November 10, 2025
మెడికల్ విద్య కోసం ఇప్పుడు జార్జియా వైపు!

భారత్ నుంచి అనేకమంది వైద్యవిద్య కోసం గతంలో ఉక్రెయిన్కు వెళ్లేవారు. రష్యాతో యుద్ధంతో ఇప్పుడు జార్జియా వైపు మళ్లుతున్నారు. RBI ప్రకారం అక్కడ ఈ చదువు కోసం 2018-19లో $10.33M వెచ్చించగా 2024-25లో అది $50.25Mలకు పెరిగింది. కాగా వారు ఇండియా వచ్చాక NExT/FMGE పాస్ కావాలి. జార్జియా నుంచి వచ్చే వారిలో 35% మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. అక్కడి వర్సిటీల గురించి ముందే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


