News January 21, 2025
కడప కోటిరెడ్డి కాలేజీ అమ్మాయికి అరుదైన గౌరవం

ఈనెల 26వ తేదీ దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు కడపకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ ఎస్.సుమియా ఎంపికైంది. కడప కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న ఈమె బెటాలియన్ స్థాయి, తిరుపతి గ్రూప్ స్థాయిలతో పాటు ప్రీ రిపబ్లిక్డే వేడుకల్లో చక్కటి ప్రదర్శన కనబరిచింది. దీంతో ఢిల్లీలో నిర్వహించే పరేడ్ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఈమెకు లభించింది.
Similar News
News July 6, 2025
పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్పై ఫిర్యాదు

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PSలో ఫిర్యాదు చేసింది.
News July 6, 2025
MLA వరదకు సర్జరీ.. కాల్ చేసి మాట్లాడిన CM

ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి గుండె ఓపెన్ సర్జరీ చేయించుకుని HYD ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న CBN శనివారం వరదకు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలంటూ ఆకాంక్షించినట్లు సమాచారం.
News July 6, 2025
కడప: ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అన్ని పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.