News January 21, 2025
గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు

AP: కులగణన డేటాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గతంలో విధించిన గడువు జనవరి 20వ తేదీతో ముగియగా, తాజాగా దాన్ని 23వ తేదీ వరకు పొడిగించింది. అన్ని సచివాలయాల్లో కులగణన డేటా ప్రదర్శించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే 1000 సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా కిట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
Similar News
News November 9, 2025
చిరంజీవికి థాంక్స్.. అలాగే క్షమాపణలు: RGV

కల్ట్ మూవీ ‘శివ’ ఈనెల 14న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ‘చిరంజీవికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.
News November 9, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

<
News November 9, 2025
అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.


