News January 21, 2025

కొడంగల్: సీఎంని, పోలీసులని దూషించిన వ్యక్తికి 14 రోజుల రిమాండ్: ఎస్ఐ

image

ఈనెల 9న సాయంత్రం కోస్గి పరిధి సర్జఖాన్‌పేట్‌కి చెందిన కోస్గి కృష్ణయ్య గౌడ్ CM రేవంత్ రెడ్డిని, పోలీసులను అసభ్య పదజాలంతో దూషించాడని స్థానిక ఎస్ఐ తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగించేలా, రెండు వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడి దానిని వీడియో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశాడని, ఈ మేరకు అతడిపై ఈనెల 11న కేసు నమోదు చేసి 20న అరెస్ట్ చేశామన్నారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News September 14, 2025

MBNR:జాతీయ మెగా లోక్ అదాలత్..UPDATE

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు.
✒సైబర్ కేసులు:97(₹32,19,769/- రీఫండ్)
✒కాంప్రమైజ్ కేసులు:193
✒ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు(డ్రంక్ అండ్ డ్రైవ్, MV Act):564
✒ఐపీసీ(అండర్ ఇన్వెస్టిగేషన్/కోర్టు విచారణలో ఉన్నవి): కేసులు-253
✒మొత్తం పరిష్కరించబడిన కేసులు: 2,597

News September 14, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలంలోని జానంపేటలో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. బాలానగర్ 50.5, భూత్పూర్ 12.8, మహబూబ్ నగర్ గ్రామీణం 12.3, దేవరకద్ర 11.8, రాజాపూర్ 7.8, నవాబుపేట 6.8, హన్వాడ 6.3, జడ్చర్ల 5.0 మిల్లీ మీటర్లు వర్షం పడింది.

News September 14, 2025

MBNR: జాతీయ లోక్ అదాలత్..2,597 కేసులు పరిష్కారం

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసినందువల్ల రాజీ మార్గం అవగాహన కలిగించి, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకూ ‘మీ ఇంటికే సత్వర న్యాయం’ జరిగిందని, మానిటరింగ్ చేసిన చేసినవారికి త్వరలో రివార్డు అందజేస్తామన్నారు.