News March 18, 2024

ప్రియుడితో కలిసి కప్పుతో ఫోజుచ్చిన స్మృతి

image

WPL రెండో సీజన్ విజేతగా ఆర్సీబీ నిలిచింది. కాగా ప్రియుడు పలాస్ ముచ్చల్‌తో కలిసి ట్రోఫీతో కెప్టెన్ స్మృతి మంధాన ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. వీలుచిక్కినప్పుడల్లా వీరు విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పలాస్ బాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. ఓ ఈవెంట్‌లో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.

Similar News

News October 6, 2024

ఏపీ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల

image

రాష్ట్రంలో జరుగుతున్న టెట్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు 21న ముగియనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన పరీక్షల కీని వెబ్‌సైట్లో పెట్టింది. మిగిలిన కీలను పరీక్షల తర్వాతి రోజున రిలీజ్ చేయనుంది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్‌కు అప్లై చేశారు. ఫైనల్ కీని అక్టోబర్ 27న, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు.
వెబ్‌సైట్: <>aptet.apcfss.in<<>>

News October 6, 2024

ప్రకటించిన అవార్డులను రద్దు చేయవచ్చా?

image

జాతీయ చలనచిత్ర అవార్డుల రద్దుకు నిర్దిష్ట నిబంధ‌న‌లు లేకపోయినా అడ్మినిస్ట్రేటివ్ లా కింద ర‌ద్దు చేసే అధికారం అవార్డుల క‌మిటీకి ఉంటుంది. ఏ గుర్తింపుకైతే స‌ద‌రు వ్య‌క్తికి అవార్డు ప్ర‌క‌టించారో దానికి సంబంధించి కాపీ రైట్స్, క్రెడిట్స్ అవకతవకలు, ప్రలోభాలకు పాల్పడడం, నేరాభియోగాలపై అవార్డు ర‌ద్దు చేస్తారు. ఈ గ్రౌండ్స్‌పైనే జానీ మాస్ట‌ర్‌కు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు.

News October 6, 2024

రేపు వారి అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద బాధితులకు ప్రభుత్వం రేపు డబ్బులు అందించనుంది. మొత్తం 21,768 మంది ఖాతాల్లో రూ.18.69 కోట్లను జమచేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందరికీ సాయం అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం గత నెలలో రూ.602 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. బ్యాంకు ఖాతాల్లో తప్పులు, ఆధార్ లింక్ కాకపోవడం వల్ల కొందరికి డబ్బులు జమకాలేదు.