News March 18, 2024
పగలు బీజేపీ.. రాత్రి కాంగ్రెస్తో బాబు దోస్తీ: పేర్ని
AP: టీడీపీ అధినేత చంద్రబాబు పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్తో చేతులు కలుపుతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ‘ఐదేళ్ల కిందట మోదీని ఉగ్రవాది అని బాబు తిట్టారు. మరి ఇప్పుడు విశ్వగురులా ఎలా కనిపించారు? పవన్, మోదీ, బాబు కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పలేదు? మీ పొత్తులు, ఒప్పందాలు ప్రజలకు అవసరం లేదు. మళ్లీ జగన్కే ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 6, 2024
బడ్జెట్ రూ.7 కోట్లు.. కలెక్షన్స్ రూ.70 కోట్లు!
కంటెంట్ ఉన్న సినిమాను ఆదరించడంలో సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని మరోసారి రుజువైంది. ఇటీవలే రిలీజైన ‘కిష్కింధకాండం’ సినిమా సైతం బాక్సాఫీసు వద్ద రూ.70 కోట్ల+ కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపిస్తోంది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించడం గమనార్హం. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీ నుంచి రిలీజైన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ చిత్రాలు భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.
News October 6, 2024
DSC పోస్టుల ఎంపికపై కీలక నిర్ణయం
TG: పలువురు DSC అభ్యర్థులు 2, 3 పోస్టులకు ఎంపికవడం, వారు ఒక పోస్టులో చేరితే వందల ఖాళీలుండటం ప్రతిసారీ జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల చేస్తుంది. ఆ తర్వాత SGTల లిస్ట్ ఇస్తుంది. మొదటి జాబితాలో ఉన్నవారెవరైనా రెండో లిస్టులోనూ ఉంటే ఆ పేరును తొలగించేలా సాఫ్ట్వేర్ను సిద్ధం చేసింది.
News October 6, 2024
చిన్నారి మర్డర్పై టీడీపీ Vs వైసీపీ
AP: పుంగనూరులో చిన్నారి అస్పియా <<14288103>>మర్డర్<<>> అధికార, విపక్షాల మధ్య రాజకీయ దుమారానికి తెరతీసింది. ఇది ప్రభుత్వ హత్యేనని YCP ఆరోపించింది. ఇప్పటికే బాలిక ఫ్యామిలీని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పరామర్శించారు. ఈనెల 9న జగన్ కూడా పుంగనూరుకు వెళ్లనున్నారు. మరోవైపు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి అనిత చెప్పారు. చిన్నారి తండ్రిని CM చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు.