News January 21, 2025
ఒకే చోట రూ.82 లక్షల కోట్లు

ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఒకే దగ్గర నిలబడ్డారు. ఈ నలుగురి నికర ఆదాయం $950 billion+గా ఉంది. అంటే అక్షరాలా రూ.82లక్షల కోట్లు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ $433 బిలియన్లతో ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు.
Similar News
News September 14, 2025
మహిళా శక్తి కారణంగానే భారత్కు గుర్తింపు: ఓంబిర్లా

AP: భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆయన మాట్లాడారు. ‘స్త్రీలకు గౌరవమివ్వడం ఆది నుంచి వస్తున్న సంప్రదాయం. స్వాతంత్ర్య పోరాటంలోనూ వారు కీలకపాత్ర పోషించారు. సామాజిక బంధనాలు తెంచుకొని అనేక ఉద్యమాలు చేశారు. మహిళా శక్తి కారణంగానే ప్రపంచంలోనే ముఖ్య దేశంగా భారత్ అవతరించింది’ అని చెప్పారు.
News September 14, 2025
యురేనియం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయా?

AP: తురకపాలెంలో ఇటీవల సంభవించిన మరణాలకు యురేనియమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. తాజాగా నీటి శాంపిల్స్లో <<17705296>>యురేనియం అవశేషాలు<<>> బయటపడినట్లు వార్తలు రాగా, దీనిపైనే చర్చ జరుగుతోంది. కాగా నీరు, ఆహారం వల్ల యురేనియం శరీరంలోకి ప్రవేశిస్తే కిడ్నీల ఆరోగ్యానికి చేటు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. చర్మం, లివర్, లంగ్స్, ఎముకలపై ప్రభావం చూపి అనారోగ్యానికి కారణం అవుతుందని వెల్లడిస్తున్నారు.
News September 14, 2025
ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు సాయం.. పాక్ వక్రబుద్ధి!

పాక్ మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నిధులను సేకరించింది. అయితే వాటిని బాధితులకు పంచకుండా ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన లష్కరే తోయిబా(LeT) ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు మళ్లించింది. అంతకుముందు LeTకి పాక్ రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. పునరుద్ధరణకు మొత్తం రూ.4.7 కోట్లు ఖర్చవుతుందని, పాక్ ఆ నిధుల సేకరణలో నిమగ్నమైందని భారత నిఘా వర్గాలు తెలిపాయి.