News March 18, 2024

నేటి నుంచి ఒంటిపూట తరగతులు

image

నెల్లూరు జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని డీఈఓ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలన్నారు. రోజూ ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News January 2, 2026

నెల్లూరు: కన్నీరు ఇంకి.. గుండెలు తడారి

image

భర్తను కోల్పోయిన భార్య.. కొడుకు దూరమై తల్లి, తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడని అర్థం కాని అభం శుభం తెలియని చిన్నారులు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబం భవిష్యత్తు అంధకారమైంది. కన్నీళ్లు ఇంకిపోయిన వారి దీనస్థితి వర్ణణాతీతం. బిడ్డల్ని ఎలా సాకాలో అర్థం కాక ఆ తల్లి మూగగా రోదిస్తోంది. అనారోగ్యంతో సైదాపురంలో ఇవాళ మృతి చెందిన నాగారాజు ఇంట్లో కనిపించిన ఈ విషాద దృశ్యం గుండెల్ని మెలిపెట్టక మానదు.

News January 1, 2026

నెల్లూరు: మొదలైన కోడి పందేలు..

image

మరో రెండు వారాల్లో సంక్రాంతి రాబోతుంది. గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ క్రమంలో పందెం రాయుళ్లు సై అంటున్నారు. కొండాపురం(M) తూర్పుయర్రబల్లి శివారులో నాలుగు రోజులుగా కోడి పందేలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పక్కల జిల్లాల నుంచి పలువురు వస్తున్నారట. రూ.లక్షలో చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారులు ఏం అంటారో చూడాలి.

News January 1, 2026

నెల్లూరోళ్లు ఎన్ని ఫోన్లు పోగొట్టుకున్నారో తెలుసా..?

image

నెల్లూరు జిల్లాలో 2025 ఏడాదిలో చోరీకి గురైన ఫోన్ల ఖరీదు చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు. ఒక్క ఏడాదిలోనే ప్రజలు 1140 మొబైల్స్ పోగొట్టుకున్నారు. వీటి విలువ రూ.2.28కోట్లు అని అధికారులు వెల్లడించారు. మన పోలీసులు ఈ ఏడాదిలో వీటిని రికవరీ చేసి బాధితులకు అందజేశారు. దీన్ని బట్టి చూస్తే.. జిల్లాలో కాస్త ఆదమరిచినా మీ జేబులోని ఫోన్ పోవడం ఖాయం.