News March 18, 2024
ఎన్నికల షెడ్యూల్ మార్చాలని ఈసీకి విజ్ఞప్తి

సార్వత్రిక ఎన్నికల కోసం ఈసీ ప్రకటించిన షెడ్యూల్పై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడు, కేరళలో ఏప్రిల్ 19, 26 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయని.. ఈ తేదీలు ముస్లింలకు ఎంతో పవిత్రమైన శుక్రవారం వస్తున్నాయని, ఆ రోజుల్లో పోలింగ్ వద్దని కోరింది. మసీదులకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించాల్సి ఉంటుందని.. అభ్యర్థులు, అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుందని పేర్కొంది.
Similar News
News April 16, 2025
బెంగాల్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర: మమత

బెంగాల్ను భ్రష్టు పట్టించేందుకు కేంద్రం మీడియాను వాడుతోందని CM మమతా బెనర్జీ ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలను మోదీ పోషిస్తున్నారని విమర్శించారు. UP, కర్ణాటక, బిహార్, రాజస్థాన్కు చెందిన వీడియోలతో బెంగాల్ను అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. యువతకు ఎన్ని ఉద్యోగాలొచ్చాయి?, పెరిగిన పెట్రోల్, డీజిల్, మెడిసిన్స్ ధరల గురించి మాట్లాడాలంటూ సవాల్ చేశారు.
News April 16, 2025
ఇన్స్టా ఫాలోయింగ్పై పూజా హేగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య బాక్సాఫీసును డిసైడ్ చేయలేదని హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు. ‘నాకు ఇన్స్టాగ్రామ్లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండొచ్చు. కానీ వారందరూ థియేటర్లకు వస్తారని కాదు. చాలా మంది సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాకు, వాస్తవానికి చాలా తేడా ఉందని అర్థం చేసుకోండి’ అని ఆమె తెలిపారు.
News April 16, 2025
ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నాం: కేటీఆర్

TG: కంచ గచ్చిబౌలి అడవిని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడైనా జ్ఞానం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. నగరంలోని 400 ఎకరాల అడవిని రక్షించడానికి విద్యార్థులు, అధ్యాపకులు అవిశ్రాంతంగా కృషి చేశారని అభినందించారు. ఆ భూముల తనఖా వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీని రికమెండ్ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు.