News March 18, 2024

దర్శి: బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

image

రెండు బైకులు ఢీకొని ముగ్గురు యువకులకు గాయాలైన సంఘటన దర్శి మండలంలోని రాజంపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. క్షతగాత్రుల బంధువు కథనం మేరకు.. పొదిలి విశ్వనాథపురానికి చెందిన అస్మత్‌ బాషా, చరణ్‌తేజ బైక్‌పై దర్శి వెళ్తున్నారు. అదే మార్గంలో ముందు వెళ్తున్న రాజంపల్లికి చెందిన గుర్రపుశాల నాగార్జున గేదెలు అడ్డురావడంతో ముందు బైక్‌ను ఢీకొని పడిపోయారు. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Similar News

News March 12, 2026

ప్రకాశం: వడగాల్పుల వేళ ముందస్తు చర్యలు

image

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.

News March 11, 2026

రేపు కనిగిరిలో జాబ్ మేళా..!

image

కనిగిరిలోని అమరావతి గ్రౌండ్‌లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ,బీ.టెక్, తదితర కోర్సులు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 18 నుంచి 26 సంవత్సరాల లోపు వారు ఆధార్ కార్డు, టీసీ, మార్క్ లిస్ట్, 2 పాస్ ఫోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.

News March 11, 2026

ప్రకాశం: వడగాల్పులపై ముందస్తు చర్యలు

image

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.