News March 18, 2024
ఏలూరు: నర్సుతో LOVE.. గర్భవతిని చేసి మోసం

ఏలూరు జిల్లాలో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. వివరాలు.. ఏలూరుకు చెందిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. నూజివీడుకు చెందిన పురమా సాయిబాబు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె అతడికి దగ్గరైంది. ఈ క్రమంలోనే గర్భం దాల్చింది. ఆ తర్వాత అబార్షన్ చేయించి.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. యువతి ఫిర్యాదుమేరకు కేసు నమోదైంది.
Similar News
News January 28, 2026
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: డీఎంహెచ్వో

జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, సహకరించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.గీతాబాయి హెచ్చరించారు. బుధవారం ఆమె చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి పీసీపీఎన్డీటీ కమిటీ సమీక్షలో మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
News January 28, 2026
ప.గో: వైసీపీ సమావేశానికి ‘కొట్టు’ దూరం

తాడేపల్లిగూడెం మాగంటి ఫంక్షన్ హాల్లో బుధవారం వైసీపీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీలోని మాజీ మంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ కొట్టు సత్యనారాయణ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన అనుచరులు సైతం సమావేశానికి దూరంగానే ఉన్నారు. కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది.
News January 28, 2026
నరసాపురం: అంతర్వేది ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవానికి భక్తుల రక్షణార్థం పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన, వీడియో ప్రజెంటేషన్ ద్వారా భద్రతా చర్యలను పరిశీలించారు. గోదావరి తీరంలో కళ్యాణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


