News January 22, 2025
సిద్దిపేట: బేటీ బచావో బేటీ పఢావో పోస్టర్ ఆవిష్కరణ

సిద్దిపేట జిల్లాలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పఢావో కార్యక్రమం నిర్వహించారు. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ చాంబర్లో “బేటీ బచావో బేటీ పఢావో” పోస్టర్స్ని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి ఆవిష్కరించారు. ఈనెల 22 నుంచి మార్చి 8, 2025 మహిళా దినోత్సవం నాటి వరకు ఆడపిల్లల ప్రాముఖ్యతను కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
Similar News
News September 13, 2025
సర్వదర్శనం టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. శనివారం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, సర్వదర్శనం టోకెన్ల కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్ వద్ద భక్తులు బారులు తీరారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సర్వదర్శనం టోకెన్ల జారీ చేసే ప్రాంతం శ్రీవారి భక్తులతో కిక్కిరిసిపోయింది.
News September 13, 2025
జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్..!

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర మంత్రులు నిరంతరం ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2.94 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్, BJP, MIM నాయకులు ఉన్నారు.
News September 13, 2025
జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్..!

జూబ్లీహిల్స్ అభివృద్ధిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర మంత్రులు నిరంతరం ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2.94 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్, BJP, MIM నాయకులు ఉన్నారు.