News March 18, 2024

నెల్లూరులో 7 సమస్యాత్మక కేంద్రాలు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,746 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 28,080 మంది రెగ్యులర్, 4,666 మంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 7 సమస్యాత్మక కేంద్రాలు(సీతారామపురం, నారాయణ రెడ్డిపేట, కలువాయి ఏ, బీ సెంటర్లు, సౌత్ మోపూరు, మర్రిపాడు, రేవూరు) గుర్తించారు. వీటిలో 4 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Similar News

News April 4, 2026

ఉదయగిరి: అస్వస్థతకు గురైన విద్యార్థినిలు

image

ఉదయగిరి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ముగ్గురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో సిబ్బంది వారిని కళాశాల అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెస్‌లో ఫుడ్ పాయిజన్ కావడం వల్లే విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో శనివారం ఉన్నతాధికారులు కళాశాలలో విచారణ చేపట్టారు.

News April 4, 2026

మహిళల రక్షణకు ‘శక్తి’ ఆయుధం: SP అజిత

image

మహిళల రక్షణే ధ్యేయంగా నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ‘శక్తి’ యాప్‌పై శనివారం విస్తృత అవగాహన కల్పించింది. SP అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఆపద సమయంలో ఈ యాప్ మహిళలకు ఎలా రక్షణ కవచంలా నిలుస్తుందో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను ప్రతి మహిళా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.

News April 4, 2026

మహిళల రక్షణకు ‘శక్తి’ ఆయుధం: SP అజిత

image

మహిళల రక్షణే ధ్యేయంగా నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ‘శక్తి’ యాప్‌పై శనివారం విస్తృత అవగాహన కల్పించింది. SP అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఆపద సమయంలో ఈ యాప్ మహిళలకు ఎలా రక్షణ కవచంలా నిలుస్తుందో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను ప్రతి మహిళా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.