News January 22, 2025

రైతుల ప్రధాన సమస్యలపై నివేదిక తయారు చేస్తాం: సత్యవతి

image

జనవరి 24 నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటిస్తామని మాజీ మంత్రి, MLC సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ పేరిట కాంగ్రెస్ చేసిన దగా, సాగునీటీ కష్టాలు, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకొని ఒక నివేదిక తయారు చేస్తామన్నారు. రైతు ఆత్మహత్యలపై ఏర్పాటుచేసిన BRS అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో తొలి సమావేశంలో సత్యవతి పాల్గొన్నారు.

Similar News

News July 6, 2025

KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

image

ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి KNR 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ నెల 8న KNR బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తదుపరి రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం 10న అరుణాచలం నుంచి మధ్యాహ్నం బయలుదేరుతుందన్నారు. మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత 11వ తేదీ సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు.

News July 6, 2025

HYD: మహిళల రక్షణ కోసం ‘SWAT’ బృందం

image

HYD నగర పోలీసులు మహిళల భద్రత, నిరసన ప్రదర్శనల నిర్వహణ కోసం 35 మంది మహిళా పోలీసులతో “స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్(SWAT)”ను ప్రారంభించారు. కరాటే, నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందం ధర్నాలు, ర్యాలీలు, ముఖ్యమైన ఈవెంట్లు, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుంది. సరికొత్త యూనిఫాంలో సచివాలయం వద్ద విధుల్లో చేరిన ఈ బృందం.. మహిళల ఆందోళనలు నియంత్రించడంలో కీలకపాత్ర పోషించనుంది.

News July 6, 2025

HYD: త్వరలో ORR వరకు అన్ని ఎలక్ట్రిక్ బస్సులే..!

image

త్వరలో HYD అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని RTC బస్సులను పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులుగా తీసుకురానున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే గ్రేటర్ HYD పరిధి ఉప్పల్, ఖైరతాబాద్, నారాయణగూడ, కాచిగూడ, సికింద్రాబాద్, ప్యారడైజ్ బేగంపేట సహా అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణ సర్వీసులు అందజేస్తున్నాయి. ఎక్స్ ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం వర్తింపజేస్తున్నారు.