News January 22, 2025

ఓసి త్రీలో కాపర్ వైర్ దొంగిలించిన ఏడుగురి అరెస్టు

image

పరశురాంపల్లి సమీపంలోని ఓసిత్రీలో కాపర్ వైర్ దొంగిలించిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకి చెందిన ఏడుగురు వ్యక్తులు రౌతు భరత్, పల్లపు నర్సింహారావు, కల్లూరి కనకయ్య, రజిత, రౌతు మల్లేశ్వరి, రమాదేవి, బోదాసు చిట్టీలు దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు.

Similar News

News July 6, 2025

గిరి ప్రదక్షిణ: పార్కింగ్ ప్రదేశాలివే-2

image

➣అడవివరం నుంచి గిరిప్రదక్షిణ నిమిత్తం తొలిపావంచకు వచ్చే వారు వాహనాలను అడవివరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో పెట్టి కాలినడకన రావి చెట్టు జంక్షన్ నుంచి గాంధీనగర్, కోనేరు మీదుగా కలశం జంక్షన్ చేరుకోవాలి
➣ వేపగుంట, గోపాలపట్నం నుంచి వచ్చే భక్తులు సింహపురి కాలనీ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలైన RTC స్థలం, GVMC పార్క్, VMRDA స్థలాల్లో వాహనాలు నిలపాలి.

News July 6, 2025

శ్రీశైలం డ్యాంకు భారీగా వరద

image

కృష్ణనది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా గతంలో ఎన్నడు లేని విధంగా మే నెల నుంచే శ్రీశైలం జలాశయానికి వరద నీటి చేరిక ప్రారంభమైంది. దీంతో డ్యాం వేగంగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుతోంది. ప్రస్తుతం జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 1,71,208 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. డ్యామ్ నీటిమట్టం 878.40 అడుగులుగా నమోదైంది.

News July 6, 2025

పేరెంట్స్ టీచర్స్ మీట్ పండుగలా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో “మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్” పండుగలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాలతో ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులకు ఆహ్వానం అందించాలని సూచించారు. ప్రతి స్కూల్లోనూ తల్లులకు పాదపూజ చేయించాలని తెలిపారు.