News January 22, 2025
BIG BREAKING: రాష్ట్రానికి భారీ పెట్టుబడి

తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా ఆ కంపెనీ భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు చేపట్టనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రానున్నాయి. 7వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఈ ఎంవోయూ జరిగింది.
Similar News
News March 25, 2026
ఇంధనం నిల్వ.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే!

‘పానిక్ బయింగ్’ వల్లే అమ్మకాలు మూడింతలు పెరిగాయని TG పెట్రోలియం డీలర్ల సంఘం తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది. ‘‘ఇంధనం ఆవిరై గాలిలో కలిసినా లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ‘స్టాటిక్ ఎలక్ట్రిసిటీ’ ఉత్పన్నమైనా భారీ పేలుళ్లు సంభవించవచ్చు. పెట్రోల్ నుంచి వచ్చే వాసన పీల్చితే శ్వాసకోశ సమస్యలు, తల తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలొస్తాయి’’ అని నిపుణులు తెలిపారు.
News March 25, 2026
LPG వెయిటింగ్ పీరియడ్లో మార్పు లేదు: కేంద్రం

వంట గ్యాస్ సిలిండర్ల వెయిటింగ్ పీరియడ్లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. గడువు యథావిధిగా పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజులుగానే కొనసాగుతోందని తెలిపింది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులకు.. నాన్ PMUYలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25రోజులు, డబుల్కు 35రోజులకు గడువు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది.
News March 25, 2026
రాత్రిపూట ఎంగిలి పాత్రలను శుభ్రం చేయకుండా వదిలేస్తున్నారా?

రాత్రి భోజనం తర్వాత అంట్లు తోమకుండా వంటగదిలో అలాగే వదిలేయడం వాస్తు రీత్యా చాలా అశుభం. ఉదయం లేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. తద్వారా దరిద్రం, పేదరికం రావొచ్చని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. ఎంగిలి పాత్రల వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు. అందుకే వీలైనంత వరకు రాత్రే వంటగదిని, పాత్రలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత, సంపద పెరుగుతాయి


