News March 18, 2024
నేటి నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట నిర్వహించాలంటూ తాజాగా ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి మే 31 వరకు అమలుచేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు వీటిని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇంటింటికీ తిరిగి పిల్లల ప్రీ స్కూల్ రీ-అడ్మిషన్, బడిమానేసిన పిల్లల వివరాలు సేకరించాల్సి ఉంటుంది.
Similar News
News February 3, 2026
పాలమూరు కార్పొరేషన్లో ఖాతా తెరిచిన కాంగ్రెస్

మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ అధికార కాంగ్రెస్ పార్టీ అప్పుడే తన ఖాతాను తెరిచింది. పాలమూరు కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మార్గం సుగమమైంది. రాజేంద్రనగర్ ప్రాంతంలోని 58వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి ఎన్నిక లాంఛనమైంది. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో హస్తం పార్టీ జెండా ఎగిరింది.
News February 2, 2026
MBNR: ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు: SP

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు పంపిణీ చేసి ప్రలోభాలకు గురిచేస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ ఆమె ఛాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీస్ బలగాలను సిద్ధంగా ఉంచాలని ఎస్పీ సూచించారు.
News February 2, 2026
MBNR: మున్సిపల్ ఎన్నికలు.. SP సమీక్ష

మహబూబ్నగర్ జిల్లా నందు జరగనున్న మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్ మున్సిపల్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎస్పీ ఛాంబర్లో ఎస్పీ డి.జానకి సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.


