News January 23, 2025
వనపర్తి: అబద్ధపు ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటనల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930, వాట్సాప్ నంబర్ 8712672222 ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
Similar News
News November 13, 2025
పెద్దపల్లి: పారామెడికల్ కోర్సులు ప్రవేశానికి దరఖాస్తులు

సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ RGMలో పారామెడికల్ కోర్సుల దరఖాస్తు గడువు నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. డీఎంఎల్టీ, డయాలసిస్ టెక్నాలజీ కోర్సుల్లో చెరో 30 సీట్లు ఉన్నట్లు చెప్పారు. బైపీసీ విద్యార్థులు అర్హులన్నారు. సీట్లు ఖాళీగా ఉంటే ఎంపీసీ విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. వివరాలకు https://tgpmb.telangana.gov.in వెబ్సైట్ సందర్శించాలని పేర్కొన్నారు.
News November 13, 2025
మందు బాబులకు కర్నూలు ఎస్పీ హెచ్చరిక

కర్నూలు జిల్లాలో బహిరంగంగా మద్యం తాగి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రోడ్లు, నడక దారులు, పార్కులు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
News November 13, 2025
కేంద్ర పథకాల అమలులో పురోగతి కనిపించాలి: కలెక్టర్

కేంద్ర పథకాల అమలులో కచ్చితమైన పురోగతి చూపించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కేంద్ర పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు లాభం చేకూరే విధంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పథకాల అమలులో పారదర్శకత, వేగం నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.


