News January 23, 2025

100 కోట్ల ఓటర్ల దిశగా భారత్

image

భారత్‌లో ఓటర్ల సంఖ్య 99.1కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ సంఖ్య 96.88కోట్లుగా ఉండేది. ఓటర్లలో యువతే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. 18-29ఏళ్ల వయస్సున్న వారు ఏకంగా 21.7కోట్ల మంది ఉన్నట్లు తెలిపింది. భారత్ త్వరలోనే 100కోట్ల మంది ఓటర్లతో రికార్డ్ సృష్టించనుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.

Similar News

News October 24, 2025

మృత్యు శకటాలుగా ప్రైవేట్ బస్సులు!

image

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మృత్యు శకటాలుగా మారాయి. 2013 అక్టోబర్ 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగి 45 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇవాళ మరో ప్రమాదంలో 20కి పైగా మరణించారు. అతివేగం, నిర్లక్ష్యం, సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అమాయకులు బలి అవుతున్నారు. ప్రమాదం జరిగిన కొన్ని రోజుల పాటు అధికారులు హడావిడి చేసినా ఆ తర్వాత తనిఖీలు చేయడం లేదు.

News October 24, 2025

ప్రమాద స్థలికి వెళ్లాలని కలెక్టర్, SPకి రేవంత్ ఆదేశం

image

చిన్నటేకూరు బస్సు ప్రమాదంపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్, డీజీపీతో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటనపై మాట్లాడిన సీఎం, తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది HYDలో ఎక్కిన ప్యాసింజర్లు ఉన్నారు. దీంతో ఘటనాస్థలికి గద్వాల కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిస్థితి సమీక్షించి, ఏపీ ప్రభుత్వం నుంచి ప్రయాణికుల వివరాలు సేకరించాలన్నారు.

News October 24, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

*త్వరలో ‘సమగ్ర లైఫ్ సైన్సెస్’ పాలసీ.. 2030కల్లా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేలా రోడ్ మ్యాప్: మంత్రి శ్రీధర్ బాబు
*గిరిజన ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్‌ డైలీవేజ్ వర్కర్లకు తగ్గించిన జీతాలు చెల్లిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ
*నాపై KTR చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తా: మంత్రి జూపల్లి కృష్ణారావు
*రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి, ఉత్పత్తి చేసేలా ప్లాంట్ ఏర్పాటుకు NFTDC సంస్థతో సింగరేణి ఒప్పందం