News January 23, 2025

వినుకొండ: బీర్‌లో పురుగుల మందు కలిపి ఆత్మహత్యాయత్నం

image

వినుకొండ మండలం తిమ్మాయిపాలెంకు చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాయపాలెంకు చెందిన గోపి అనే యువకుడి భార్య మృతి చెందింది. దీంతో మనస్తాపానికి గురైన గోపి బీర్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News February 5, 2025

తెనాలి: రైలు నుంచి జారిపడి వాచ్ మెన్ మృతి

image

రైలు నుంచి జారి పడి గాయాలపాలైన ప్రయాణికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చీరాలకు చెందిన భాస్కర్‌(48) నిడుబ్రోలులోని రైతుబజార్‌లో వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రైలులో ప్రయాణిస్తూ తెనాలి స్టేషన్‌లో రైలు నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు వైద్యశాలకు పంపగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 5, 2025

బహిరంగంగా మద్యం సేవిస్తే చర్యలు: డీఎస్పీ

image

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీ కృష్ణ‌ తాడేపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సీతానగరం, మహానాడు వరకు నడుచుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులకు డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

News February 4, 2025

GNT: భర్తను రెడ్ హ్యాండె‌డ్‌గా పట్టుకున్న భార్య

image

ఉమ్మగి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. కొన్ని రోజులుగా భార్య నవ్యశ్రీని విడిచిపెట్టి తప్పించుకు తిరుగుతున్న భర్త వాసు, ప్రియురాలు గాయత్రితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో భర్త, ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. నవ్యశ్రీ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!