News January 23, 2025
కర్నూలు జిల్లా పోలీసులను అభినందించిన డీజీపీ

కర్నూలు జిల్లాలో పోలీసుల కృషి, పనితీరు అభినందనీయమని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. బుధవారం నగరంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఐజీ ప్రవీణ్ సమక్షంలో సమీక్ష నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ.. ప్రజలకు మరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో పని చేయాలన్నారు. విజబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, సైబర్ నేరాలను కట్టడి చేయాలని సూచించారు. ఎస్పీ బిందు మాధవ్ హాజరయ్యారు.
Similar News
News March 3, 2026
మంత్రి టీజీ భరత్ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా?

ఈ రెండేళ్లలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎన్ని పరిశ్రమలు తీసుకోచ్చారు? యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా అని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పరారవుతున్నారన్నారు. రాష్ట్రంలో పబ్లు తప్ప హబ్లు లేవన్నారు. కార్మిక రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.
News March 3, 2026
కర్నూలులో హత్య.. జీవిత ఖైదు

కర్నూలు షరీఫ్ నగర్లో 2021లో జరిగిన హత్య కేసులో ముద్దాయి దగ్గుపాటి రాజుకు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కబర్థి తీర్పునిచ్చారు. హత్యాయత్నం కేసులో మరో 3 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. వడ్డిపాటి వెంకటేశ్వర్లుపై కత్తితో దాడిచేసి హత్య చేసినట్లు నేరం రుజువైంది. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
News March 3, 2026
కర్నూలులో హత్య.. జీవిత ఖైదు

కర్నూలు షరీఫ్ నగర్లో 2021లో జరిగిన హత్య కేసులో ముద్దాయి దగ్గుపాటి రాజుకు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కబర్థి తీర్పునిచ్చారు. హత్యాయత్నం కేసులో మరో 3 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. వడ్డిపాటి వెంకటేశ్వర్లుపై కత్తితో దాడిచేసి హత్య చేసినట్లు నేరం రుజువైంది. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.


