News January 23, 2025
భూంపల్లి: ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవమయ్యాడు

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలాడు. SI హరీష్ గౌడ్ తెలిపిన వివరాలు.. అక్బర్పేట్ భూంపల్లి మండలం చిన్ననిజాంపేటకు చెందిన రంజిత్(33) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తిరిగి రాలేదు. దీనిపై కుటుంబీకులు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొతారెడ్డిపేట పెద్ద చెరువు వద్ద ఉన్న బైక్, ఫొన్ ఆధారంగా గాలించగా చెరువులో మృతదేహం దొరికింది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News March 8, 2026
ADB: ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు

ITI సంబంధిత ఏదైనా ట్రేడుల్లో అనుభవం ఉండి సర్టిఫికేట్ లేని ప్రైవేట్ అభ్యర్థుల నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ITI కోర్సులకు సంబంధించిన ట్రేడుల్లో కనీసం 3 సం.ల పని అనుభవం కలిగి, 21 వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 లోపు వరంగల్లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 8, 2026
ఎమ్మెల్సీ అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A2గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై నాన్ బైలబుల్ వారెంట్ జారీ అయింది. ఈనెల 5న ఆమెపై రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఈ వారంట్ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. డ్రైవర్ హత్య కేసులో దర్యాప్తు చేసిన సిట్.. కోర్టులో అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ వారెంట్ జారీ అయినట్లు సమాచారం.
News March 8, 2026
ఈరోజైనా అభి’షేక్’ చేస్తాడా?

T20 WCలో నిరాశ పరుస్తున్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళ NZతో ఫైనల్లోనైనా చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫామ్లో ఉన్న శాంసన్కు తోడు అభి రాణిస్తే బ్యాటింగ్లో INDకి తిరుగుండదు. నిన్న ప్రాక్టీస్ టైమ్లో అభితో హెడ్ కోచ్ గంభీర్ 40 నిమిషాలపాటు మాట్లాడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాగా ఈ WCలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్లలో 89 రన్స్ మాత్రమే చేశారు. ఇందులో 3 డకౌట్లు ఉన్నాయి.


