News January 23, 2025

పెరిగిన చలి.. BHPL, ములుగు జిల్లా వాసుల ఇబ్బందులు

image

భూపాలపల్లి, ములుగు జిల్లాల వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల, మల్హర్ రావు మండలాల ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏటూరునాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి, ములుగు మండలాల్లోని ప్రధాన రహదారులను పొగ మంచు కప్పేయడంతో ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News September 15, 2025

MHBD: ఘోరం.. యూరియా కోసం వెళ్లి మృత్యుఒడికి

image

యూరియా కోసం వెళ్లిన ఇద్దరు రైతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బొద్దుగొండకు యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా గూడూరు మండలంలో జగన్ నాయకులగూడెం వద్ద వేగంగా వచ్చిన బోలెరో వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దారావత్ వీరన్న, బానోత్ లాల్య అనే ఇద్దరు రైతులు మృతి చెందారు. ఇంటికి యూరియా బస్తా తెస్తారని ఎదురుచూస్తున్న వారి కుటుంబాలకు ఇది తీరని విషాదాన్ని మిగిల్చింది.

News September 15, 2025

మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హతం

image

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. మిగతా ఇద్దరు చంచల్, జహల్‌పై తలో రూ.50 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,11,060కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.1,01,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,42,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.