News January 23, 2025
రామారెడ్డి: హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు KMR అదనపు SP చైతన్య రెడ్డి తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారానికి చెందిన పొక్కిలి రవి(41)ని అతడి అన్న కిష్టయ్యా ఈనెల 19న హత్య చేయించాడు. వారి మధ్య భూతగాదాలు ఉండటంతో కిష్టయ్య, అతడి భార్య సత్తవ్వ, కుమారుడు కిషన్ కలిసి షేక్ అఫీజ్, నరేశ్కు సుపారీ ఇచ్చి హత్య చేయించారు. కేసు నమోదు చేసిన రామారెడ్డి SI నరేష్ వారిని అరెస్టు చేశారు.
Similar News
News January 14, 2026
నిజామాబాద్: ఆర్టీసీ స్పెషల్ వసూళ్లు !

సంక్రాంతి నేపథ్యంలో నిజామాబాద్ రీజియన్లోని ఆరు డిపోల నుంచి వివిధ రూట్లల్లో 500 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతుండగా గ్రామీణా ప్రాంతాలకు వెళ్లే బస్సులు తగ్గడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లేవారి నుంచి స్పెషల్ పేరిట అదనంగా 50 శాతం పసూళ్లు చేస్తోందని, పండగపూట ఆర్టీసీ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
News January 13, 2026
బోధన్ శివారులో డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రుద్ర వెంచర్ వద్ద ద్విచక్ర వాహనపై వెళ్తున్న లంగ్డ పూర్ పూర్ గ్రామానికి చెందిన అంజి (38)ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News January 13, 2026
బోధన్ శివారులో డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రుద్ర వెంచర్ వద్ద ద్విచక్ర వాహనపై వెళ్తున్న లంగ్డ పూర్ పూర్ గ్రామానికి చెందిన అంజి (38)ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.


