News January 23, 2025
HYD ఎయిర్పోర్ట్లో సందర్శకులకు నో ఎంట్రీ

గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT
Similar News
News March 12, 2025
పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

వేసవి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం ముత్తారం మండలంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6℃గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 19.1℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.
News March 12, 2025
జగిత్యాల: తాజా మాజీ సర్పంచుల ముందస్తు అరెస్ట్

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో అసెంబ్లీ ముట్టడిస్తారని ఉద్దేశంతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తమకు రావలసిన బకాయి బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమకు బిల్లులు చెల్లించే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని సర్పంచులు హెచ్చరించారు.
News March 12, 2025
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో పిలుపు: పార్వతీపురం డీఈవో

9వ తరగతి విద్యార్థులకు ఇస్రో నుంచి పిలుపు వచ్చిందని డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. యంగ్ సైంటిస్ట్ -2025 పేరిట ఉపగ్రహ ప్రయోగాలను తెలుసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఎనిమిదో తరగతిలో 50 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తును ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్లో నాలుగు దశల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటివరకు విద్యార్థుల వద్ద నుంచి 40అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు.