News January 23, 2025
NLG: నేటి నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు

సూర్యాపేట జిల్లాలో జాన్ పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి 25వ తేదీ వరకు జరగనుంది. మూడు రోజులపాటు నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దలకు ఛార్జీ రూ.40, పిల్లలకు రూ.20గా నిర్ణయించామన్నారు. నల్గొండ, మిర్యాలగూడెం నుంచి వచ్చే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.
Similar News
News January 12, 2026
నల్గొండ: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం: కలెక్టర్

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. CSతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లోని 162 వార్డులకు సంబంధించి తుది ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ముగిసిందని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
News January 12, 2026
నల్గొండ: ప్రజావాణిలో కలెక్టర్కు సమస్యలపై వినతి

నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అన్నెపర్తిలో ఓ ఇంటి వివాదం, నల్గొండలోని 20వ వార్డులో డ్రైనేజీ సమస్యలతో పాటు, మంజూరై ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్కు వివరించారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవి, శ్రవణ్, నవీన్, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
News January 12, 2026
NLG: జిల్లాలో పెరుగుతున్న రాజకీయ వేడి!

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కారు అడుగులు వేస్తుండడంతో బల్దియాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఓటర్ల తుది జాబితా ప్రకటనకు ముందే రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, అనుకూలించకపోతే ఏం చేయాలన్న విషయమై ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. NLG జిల్లాలో ప్రధానంగా NLG (ఇప్పుడు కార్పొరేషన్), MLG, CTL, DVK, HLY, CDR, నందికొండ, నకిరేకల్ వంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవాళ వార్డుల వారిగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.


