News January 23, 2025

BNGR: 23 యూనిట్లు మంజూరు: నరసింహారావు

image

దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు. 50వేల రూపాయలతో 100% రాయితీతో 23 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. 21 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన దివ్యాంగులు అర్హులని పేర్కొన్నారు. ఫిబ్రవరి రెండో తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 8, 2025

‘శుక్ల పక్షం’ అంటే ఏంటి?

image

ప్రతి నెలా అమావాస్య తర్వాత, పౌర్ణమి వరకు ఉండే 15 రోజుల కాలాన్ని శుక్ల పక్షంగా వ్యవహరిస్తారు. ఈ పక్షంలో చంద్రుని కళలు క్రమంగా పెరుగుతుంటాయి. రోజురోజుకూ వెన్నెల పెరుగుతుంది. చంద్రుడు ప్రకాశవంతమయ్యే స్థితిలోకి వెళ్లడం వల్ల దీనిని వృద్ధి చంద్ర పక్షం/ తెలుపు పక్షం అని కూడా అంటారు. శుక్ల అంటే తెలుపును సూచిస్తుంది. దాని ఆధారంగా శుక్ల పక్షం అనే పేరు వచ్చింది. దీన్నే శుద్ధ పక్షం అని కూడా పిలుస్తారు.

News November 8, 2025

CWCలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌(CWC)లో 22 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎగ్జామ్‌కు 21 రోజుల ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://cwceportal.com/

News November 8, 2025

ఈనెల 16న కొత్తగూడెంలో జాబ్ మేళా

image

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12న తలపెట్టిన జాబ్ మేళాను 16వ తేదీకి మార్చబడిందని నిర్వాహకులు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ పక్కనగల కొత్తగూడెం క్లబ్లో మేళా ఉంటుందని చెప్పారు. పది నుంచి పీజీ వరకు చదివిన వారు అర్హులని చెప్పారు. 65+ కంపెనీల్లో 3,500 ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నారు. ట్రాన్స్ జెండర్, చెవిటి, మూగ, దివ్యాంగులకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఉ.9 నుంచి సా.5 గంటల వరకు హాజరవ్వాలన్నారు.