News March 18, 2024
ఒకసారే గ్రూప్-1 మూల్యాంకనం: APPSC
AP: గ్రూప్-1(2018) మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని APPSC ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ‘ఈ పరీక్షలను హైకోర్టు రద్దు చేయడంపై అప్పీల్కు వెళ్తాం. కమిషన్పై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో, సరైన వివరణ ఇస్తాం. పరీక్షలు, నియామకాలు పారదర్శకంగా జరిగాయి. CCTV నిఘాలో జరిగిన మూల్యాంకనం ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఈ విషయంలో మాపై మచ్చ పడిందని అనుకోవడం లేదు’ అని స్పష్టం చేశారు.
Similar News
News September 30, 2024
వారసత్వ రాజకీయాలు.. BJP vs DMK
వారసత్వ రాజకీయాలపై BJP, తమిళనాడులోని DMK మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ సీఎంలుగా పని చేయగా, తాజాగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యారు. ఉదయనిధి తర్వాత ఆయన వారసుడు ఇన్బనితి సీఎం అవుతారని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అయితే కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జైషా ఏ అర్హతతో బీసీసీఐ సెక్రటరీ అయ్యారని డీఎంకే శ్రేణులు కౌంటరిస్తున్నాయి.
News September 30, 2024
కాంగ్రెస్ ఎంపీ అనిల్కు లీగల్ నోటీసు పంపుతున్నా: హరీశ్రావు
TG: హిమాయత్ సాగర్ FTL భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్లో వాటా ఉందని తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై బురద చల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. అబద్ధపు ప్రచారం చేస్తున్న అనిల్కు లీగల్ నోటీసు పంపుతున్నా. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News September 30, 2024
మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. OCT 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని Xలో వెల్లడించారు. 1950లో కోల్కతాలో జన్మించిన మిథున్.. 1976లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989లో ఏకంగా 19 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించారు.