News January 23, 2025

నర్సాపూర్ (జి): బస్సును ఢీ కొట్టిన లారీ

image

నిర్మల్ నుంచి భైంసా వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును నసీరాబాద్ గ్రామ శివారులో అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న దిలావర్పూర్‌కు చెందిన నర్సమ్మకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిరణ్ వెల్లడించారు.

Similar News

News September 14, 2025

వికసిత్ భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యం: జేపీ నడ్డా

image

వికసిత భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో సారద్యమ్ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మగ్గిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 15 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు. మోదీ, చంద్రబాబు అంకితభావం వల్లే ఈ మార్పు సాధ్యమైందన్నారు.

News September 14, 2025

HYD భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు

image

నాగోల్‌‌లో భార్య మహాలక్ష్మి గొంతును భర్త వేణుగోపాల్ కత్తితో కోశాడు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అతడు మారకపోగా.. ఈరోజు ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా, వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2025

MBNR:GOOD NEWS.. ITIలలో నేరుగా ప్రవేశాలు

image

MBNRలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మిగిలి ఉన్న సీట్లకు వాక్ ఇన్ అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ బి.శాంతయ్య Way2Newsతో తెలిపారు. ప్రభుత్వ ITI/ATC, ప్రైవేట్ కాలేజీలలో ఈ నెల 30 వరకు 4వ విడత స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని, 1,2,3 విడుదలలో అప్లై చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, అర్హత గల ఉమ్మడి జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.