News January 23, 2025

తెనాలి: వైకుంఠపురం హుండీలో రూ.2000 నోట్లు

image

వైకుంఠపురం దేవస్థానంలో స్వామి వారి హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, భక్తుల సమక్షంలో లెక్కింపు చేపట్టగా రూ. 2000 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. రూ.4 లక్షలు విలువ చేసే మొత్తం 200 నోట్లను గుర్తించారు. 2023 మేలో రూ.2000 నోట్లను ఆర్బిఐ బ్యాన్ చేయగా ఆ ఏడాది అక్టోబర్ నుంచి ఈ నోట్లు వాడుకలో లేవు. అయితే దేవుడి హుండీలో ఈ నోట్లు మళ్లీ ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది.

Similar News

News November 5, 2025

మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

image

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 4, 2025

అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

image

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేసి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.

News November 4, 2025

GNT: మోటార్ వాహనాలకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు

image

దివ్యాంగులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనాలు మంజూరుకు ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డీ.డీ దుర్గాబాయి తెలిపారు. వంద శాతం సబ్సీడీతో ఈ వాహనాలు అందించడం జరుగుతుందని చెప్పారు. www.apdascac.ap.gov.inలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. దివ్యాంగుల స్వతంత్ర చలనశీలత, ఆత్మ నిర్భరత, సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని తెలిపారు.