News January 23, 2025

మాచవరం: సరస్వతి భూముల వివాదం ఇదే

image

పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కి భూములు కేటాయించారు. వారికి కేటాయించిన భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. గత నవంబరులో ఈ వ్యవహారంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించి ఇందులో భాగంగా వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు.

Similar News

News February 5, 2025

నగ్న వీడియోలతో బెదిరింపులు.. గుంటూరు వ్యక్తిపై కేసు

image

సాఫ్ట్‌వేర్ యువతులను ట్రాప్ చేసి వీడియో కాల్స్ రికార్డ్ చేసి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న మస్తాన్ సాయి అనే వ్యక్తిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మస్తాన్ సాయి గుంటూరు, నల్లచెరువు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బీటెక్ నుంచే అడ్డదారి పట్టాడని, నిందితుడు తండ్రి మస్తాన్ దర్గాకు వారసత్వ ధర్మకర్త కాగా మస్తాన్ వద్ద 80పైగా వీడియో కాల్స్ దృశ్యాలు ఉన్నాయన్నారు. 

News February 5, 2025

తెనాలి: రైలు నుంచి జారిపడి వాచ్ మెన్ మృతి

image

రైలు నుంచి జారి పడి గాయాలపాలైన ప్రయాణికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చీరాలకు చెందిన భాస్కర్‌(48) నిడుబ్రోలులోని రైతుబజార్‌లో వాచ్ మెన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రైలులో ప్రయాణిస్తూ తెనాలి స్టేషన్‌లో రైలు నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు వైద్యశాలకు పంపగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 5, 2025

బహిరంగంగా మద్యం సేవిస్తే చర్యలు: డీఎస్పీ

image

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీ కృష్ణ‌ తాడేపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సీతానగరం, మహానాడు వరకు నడుచుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులకు డీఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!