News January 23, 2025
NGKL: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కొత్తపల్లి కుమార్

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడడం సరైనది కాదని బీఎస్పీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొత్తపల్లి కుమార్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల తెలకపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటించిన సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 13, 2026
పందెం కోళ్లు.. పేర్లు తెలుసా?

AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలోని పలు చోట్ల బరులు, కాళ్ల బలం చూపించేందుకు కోళ్లు సిద్ధమయ్యాయి. నెలలుగా ప్రత్యేక శిక్షణ, ఆహారం ఇచ్చి రెడీ చేసిన తమ కోళ్లను బరిలో దించి గెలిచేందుకు యజమానులు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సేతు, కాకి, డేగ, నెమలి, పర్ల, రసంగి, కిక్కిరాయి, మైల, పింగళి, అబ్రాస్ రకాలను బరిలో దించుతుంటారు. కోళ్ల ఈకల రంగు, మెడ, కాళ్ల సైజు, శరీర తత్వాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు.
News January 13, 2026
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ

సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బంగారు ఆభరణాల దొంగతనాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.
News January 13, 2026
JN: రూ.100 కోట్లకు పైగానే అక్రమాలు!

భూభారతిలో అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.100 కోట్లు గండి కొట్టినట్లు తెలుస్తోంది. 2020 Nov 2 నుంచి 31 DEC 2025 వరకు (భూభారతి + ధరణి ) 52,13,729 ట్రాన్సాక్షన్లు జరిగాయి. 41,38,641 సేల్ డీడ్ ట్రాన్సాక్షన్లతో ప్రభుత్వానికి రూ.13,473 కోట్ల ఆదాయం వచ్చింది. సుమారు 5,200 స్లాట్ బుకింగ్లలో అక్రమాలు జరిగినట్లు సమాచారం. NLG, MDK, RR జిల్లాల్లోనే అత్యధిక ఫ్రాడ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.


