News March 18, 2024
TDP నుంచి ఐదుగురు అభ్యర్థులు మెుదటిసారి ఎన్నికల బరిలో..

అనంతపురం వ్యాప్తంగా 14 నియోజకవర్గాలకుగాను 11 నియోజకవర్గాల MLA అభ్యర్థులను TDP అధిష్ఠానం ప్రకటించింది. వీరిలో ఐదుగురు మెుదటిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. వారు సవిత(పెనుకొండ), సునీల్ కుమార్(మడకశిర), సురేంద్రబాబు(కళ్యాణదుర్గం), యశోదాదేవి(కదిరి), పల్లె సింధూరారెడ్డి(పుట్టపర్తి)లు ఉన్నారు. వారిలోనూ ముగ్గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మెుదటిసారి ఎవరు ఎన్నికల బరిలో గెలుస్తారో కామెంట్.
Similar News
News April 5, 2026
రేపు జరగబోయే పోలీస్ PGRS రద్దు: అనంతపురం ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన పోలీస్ PGRS కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా పోలీస్ PGRS కార్యక్రమానికి అర్జీదారులు ఎవరు రాకూడదని సూచించారు. పేరు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా బందోబస్తు, విధుల దృష్ట్యా PGRSను రద్దు చేశామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.
News April 5, 2026
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: కలెక్టర్

అనంతపురంలోని కలెక్టరేట్లో సోమవారం జరుగునున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 6న సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.
News April 4, 2026
సీఎం పర్యటనపై ఎస్పీ కలెక్టర్ సమీక్ష

యాడికి మండలంలో అనంతపురంకలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సీఎం 6న యాడికి మండలంలో జలధార కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో హెలిపాడ్, మార్కెట్ యార్డ్, సీఎం జల హారతి నిర్వహించే పెండేకల్ జలాశయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. పర్యటనలో ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.


